మానవత్వాన్ని చాటుకున్న జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్

విజయనగరం, 27వ డివిజన్, స్థానిక జొన్నగుడ్డి ప్రాంతానికి చెందిన పావడ ఆదమ్మ (70) అనారోగ్యంతో చనిపోయారు. ఖననానికి కుటుంబ సభ్యులు ఎవరూ(లేకపోవడంతో) ముందుకు రాకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన జనసేన కార్పొరేట్ అభ్యర్థి, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ప్రధాన కార్యదర్శి లోపింటి కళ్యాణ్, విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ఇల్తామాష్ ను ఆశ్రయించారు.
వారు వెంటనే స్పందించి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న పార్ధివ రధాన్ని తెప్పించి, ఆదమ్మ మృతదేహాన్ని దాసన్నపేట వద్ద స్వర్గధామంకు చేర్చాక, అంత్యక్రియలు దగ్గరుండి కళ్యాణ్ జరిపించారు.

మానవత్వం చాటుకున్న కళ్యాణ్ కు జనసేన నాయకులు, జనసైనికులు, ఝాన్సీ వీరమహిళలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు జిల్లా చిరంజీవి యువత నుండి అభినందనలు తెలిపారు.