నెలలు గడుస్తున్నా పూర్తి కానీ రోడ్డు నిర్మాణం : పోట్నూరు లక్ష్మునాయుడు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం సూర్యనారాయణ పురం నుండి వయా నడుపూరిపేట, రౌతుపేట గ్రామం వరకు ప్రభుత్వం రోడ్డు అమలు చేసి నల్లపిక్కా వేయడం జరిగి 11నెలలు గడిచినా ఇంతవరకు ఆరోడ్డు పూర్తిచేసి బాగుచేసిన దాఖలా కనిపించలేదు. ఆరోడ్డు పై రాకపొకలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా స్పందించి రోడ్డు పనులు వేగవంతం చేస్తారని రౌతుపేట జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.