పైడమ్మ తల్లిని దర్శించుకున్న పెడన జనసేన నాయకులు

పెడన: పైడమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని పెడన పట్నంలో ఉన్న పైడమ్మ అమ్మవారిని గురువారం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. 16వ శతాబ్దం కాలం నాటి నుండి పైడమ్మ అమ్మవారిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పురాతనమైన ఆలయాల్లో పైడమ్మ అమ్మవారు ఆలయం ఒకటి. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్చొద్దని, తమ పాడిపంటలను రక్షిస్తుందని భక్తుల విశ్వాసం. పెడన నియోజకవర్గ ప్రజలపై పైడమ్మ అమ్మవారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ.. శీరం సంతోష్, భీమవరపు పరమేశ్వరరావు, కనపర్తి వెంకన్న , దాసరి నాని, పినిశెట్టి రాజు, పేర్ని శంకర్, సాయి మరియు జనసైనికులు పైడమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.