జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మచిలీపట్నం జనసేన

మచిలీపట్నం, జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ ఆదేశాల మేరకు మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత దేశ ఉపప్రధానిగా వారు చేసిన సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అర్థశతాబ్దం పైగా రాజకీయాల్లో కొనసాగిన మచ్చలేని మహానాయకుడుగా చరిత్రకెక్కారని, అణగారిన వర్గాలకు వారు చేసిన సేవలు మరువలేనివనివక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు, జిల్లా నాయకులు వంపుగడపల చౌదరి, జన్ను నాగరాజు, భవాని, బొమ్మసాని నరేష్, డివిజన్ ఇంచార్జిలు వేణు, కర్రి మహేష్, ఇమని మణి బాబు, తోట భాస్కరరావు, లంకె శ్రీనివాస్, ఉడుముల బుజ్జి, శివ, వడ్డీ చిరంజీవి, కృష్ణ, వేముల వెంకటేశ్వరరావు, తోట రాజేష్, వీర మహిళలు, ఉషారాణి, రంగమణి, మైకేల్, మణికంఠ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.