పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఖబర్దార్ – జనసేన నాయకులు సవాల్

గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ జనసేన నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, చూస్తుంటే తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద, మరియు ఆయన కాన్వాయ్ వెంట వైసిపి పార్టీకి చెందిన అగంతకుల రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ జోలికొస్తే రాష్ట్రంలో లక్షలాది జనసైనికులు తిరగబడతారు జాగ్రత్త. పవన్ కళ్యాణ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డి దాడి చేయాలని కుట్రలు చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలని కుట్ర జరిగిందని మాట్లాడితే డీజీపీ గానీ ముఖ్యమంత్రి గానీ స్పందించలేదంటే దాడికి కుట్ర జరిగిందని నేడు నిర్ధారణ అయిందని, పవన్ కళ్యాణ్ పై ఈగ వాలితే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుందని, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపారని, కేంద్రం తక్షణమే పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరి సెక్యూరిటీని కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలంకి సారధి బాబు, సందు పవన్, షేక్ మీరా షరీఫ్, మాచర్ల రామకృష్ణ (ఆర్కే), అర్జ కృష్ణ, వడ్డె గిరి, కొట్టే శివ, షేక్ రబ్బాని, నూనె అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.