పసుపులేటి హరి ప్రసాద్ ని కలిసిన మదనపల్లె జనసేన నాయకులు

జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్ ని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, వారి సతీమణి నలిని. మదనపల్లె జనసేనాని టీం అధ్యక్షులు గోపాలకృష్ణ, జనసేన మదనపల్లె మండల కమిటి ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, గుణ తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుల వారితో జనసేన ఏవిధంగా బలోపేతం చేయాలి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు జనసేన అధినేత ఆశయాలను ఏ విధంగా ప్రజలకు చేరవేయాలి అనే పలు అంశాలపై చర్చించడం జరిగింది.