పార్టీలో సముచిత స్థానం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మడ్డు

కాకినాడ సిటీ: జనసేన పార్టీ సిటీ కమిటీ లో ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నియమించి సముచిత స్థానం కల్పించిన జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ కి ఈ నియామకానికి ముఖ్య కారకులు ముత్తా గోపాల కృష్ణ కి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు యువ నాయకులు ముత్తా శశిధర్ కి సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తన పై నమ్మకం తో అప్పగించిన బాధ్యతలను అత్యంత విశ్వాసం తో నిర్వర్తించి జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి పార్టీ విజయానికి కృషి చేస్తానని విజయ్ తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పించిన ప్రతి ఒక్కరికీ మడ్డు మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు.