మహా రక్తదాన శిబిరం – విస్తృతంగా ఆహ్వాన కరపత్రాల పంపిణీ

రాజానగరం, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో, జిల్లాస్థాయిలో జనసేన పార్టీ తరఫున అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీగా జరిగే ‘మహా రక్తదాన శిబిరాని’కి నియోజవర్గం నలుమూలలా అన్ని గ్రామాల జనసేన శ్రేణులకు ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని చరిత్రలో మిగిలిపోయే విధంగా విజయవంతం చేయాలని, రక్తదాన శిబిరం ఆహ్వాన కరపత్రాలు పంపిణీ చేసిన రాజనగరం నియోజకవర్గం జనసేన శ్రేణులు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ తో పాటు జిల్లాలో ఉన్న ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా కార్యవర్గం, నాయకులు, జనసేన శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.