పేద ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధించుటకై పోరాడుతాం

  • జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు
  • జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పాతపల్లి గ్రామంలో పర్యటించిన జనసేన వనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు

తెలంగాణ, వనపర్తి నియోజకవర్గం: పెబ్బైర్ మండలంలోని పాతపల్లి గ్రామంలో బుధవారం జనసేన పార్టీ వనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు పర్యటించారు. వనపర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పాతపల్లి గ్రామ జనసైనికులతో కలిసి గ్రామంలోని ప్రజలను కలిసి వారి స్థితిగతులను గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు జనసేన పార్టీ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. వారి సమస్యల్ని పరిష్కరించేందుకు పార్టీ నుండి కృషి చేస్తామని, గ్రామంలోని అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని, అసలైన నిరుపేదలకు మొదటగా సాయం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులకు, యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఆచరణలో పెట్టలేక పోయిందని వాళ్లు చెప్పిన మాటలు అన్నీ ఎన్నికల ప్రసంగానికి మాత్రమే పరిమితం చేసి వాస్తవరూపంలో అమలు లేక ప్రజల ఆలోచనలో ఓడిపోయారు అనేది గుర్తించాలని పేర్కొన్నారు. రాజకీయంగా అన్ని సామాజిక వర్గాల వారికి జనసేన అవకాశం ఇస్తుందని యువతకి పెద్దపీట వేస్తూ వారికే నాయకత్వాని అప్పగిస్తూ అన్ని పార్టీలలాగా యువతను వాడుకోకుండా వారికే అవకాశం ఇచ్చి నాయకులను చేసి చూపిస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యువకులతో పాటు సామాన్య ప్రజలు అందరూ నిజాయితీగా ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు మరియు జిల్లా నాయకులు బాలకృష నియోజకవర్గ నాయకులు సురేష్ యాదవ్, సూర్య ప్రకాష్, పెబ్బేరు మండల నాయకులు రవి కుమార్, ముస్తఫా గ్రామంలోని ముఖ్య నాయకులు శివ కుమార్, మున్ను, జావిర్, కధిర్, అల్తాఫ్, ఉషన్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.