మహాపాదయాత్రకు జనం నీరాజనం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, రాజవరం (గ్రామంలో రెండవ రోజు) జనంకోసం జనసేన మహా పాదయాత్ర 13వ రోజు భాగంగా రాజవరం గ్రామంలో కార్యక్రమానికి ప్రజల జననీరాజనంతో ముందుకు సాగింది. రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ తుగ్లక్ పాలనతో రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన ఈ వైసీపీ సర్కాన్ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని, దానికి ప్రజలందరూ సహకరించి, ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన విధానాలు ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ మెడిశెట్టి శివరాం, సర్పంచులు కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, గళ్ళ రంగా, సీనియర్ నేతలు కర్రీ దొరబాబు, బదిరెడ్డి దొర, అడ్డాల దొరబాబు, మన్యం శ్రీను, మద్దిరెడ్డి బాబులు, అడ్డాల శ్రీను, నాతిపాం దొరబాబు, అరిగెల రామకృష్ణ, ఇందల వీరబాబు, పండు హెచ్ వై డి, ముచ్చి మణికంఠ, దర్మదాసు మాణిక్యం, ఇందల, సతీష్, దంగేటి సత్తిబాబు, పెద్ద ఎత్తున వీర మహిళలు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.