ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉద్యోగులను బెదిరించే ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు: కూసంపూడి శ్రీనివాస్

*కూసంపూడి శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.

సీపిఎస్ రద్దు చేయలేదు… ఫిట్మ్ంట్ పెంచలేదు… అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బహిర్గతం చేయలేదు, పాత హెచ్.ఆర్.ఏ స్లాబ్ లు ఇవ్వలేదు. అయినా కూడా ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చేసాం అని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వంపై ఉద్యోగులు… ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరశనలు తెలియచేస్తుండడంతో దిక్కుతోచని ప్రభుత్వం వారి గొంతు నొక్కడానికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రెస్మీట్ పెట్టి ఉద్యోగులను బెదిరించే ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాల వారితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ అన్నారు.