రాజంపేట జనసేన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి మరియు పార్లమెంట్ ఇంచార్జ్ హాజరై ఘనంగా పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించి భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు సూచించిన సత్య అహింసా మార్గాలలో జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ జడ్డా శిరీష, జనసేన నాయకులు భాస్కర పంతులు, కత్తి సుబ్బరాయుడు, గురువుగారు వాసు, ఈశ్వర్, వెంకటయ్య, ఆచారి, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, రాఘవ, అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.