రామగుండం జనసేన ఆధ్వర్యంలో మహాత్ముడి జయంతి వేడుకలు

తెలంగాణ, రామగుండం నియోజకవర్గం: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని చౌరస్తా లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు రావుల సాయిక్రిష్ణ, వీరమహిళ కనిగంటి మంగ, ఉమ్మడి జిల్లా నాయకులు మంథని శ్రవణ్. అనంతరం నాయకులు రావుల సాయిక్రిష్ణ మాట్లాడుతూ.. సత్యం, అహింసా మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గొప్ప మహనీయులు గాంధీ గారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మోతే రవికంత్, చిట్టి రాజశేఖర్, గొలి మహేందర్, అంతర్గం మండల నాయకులు తీగుట్ల నరేశ్, రామగుండం మండల నాయకులు వడ్డేపల్లి రాకేష్, మర్క అశ్రిత్ తదితరులు పాల్గొన్నారు.