జనసేన విద్యార్థి విభాగం నాయకులను సన్మానించిన మహేష్ పెంటల

  • నియోజకవర్గ కో-ఆర్డినేటర్స్ గా ఎంపికైన జనసేన విద్యార్థి విభాగం నాయకులకు ఘన సన్మానం

హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల పోటీలో నిలబడే ప్రక్రియలో భాగంగా సోమవారం విడుదల చేసిన నియోజకవర్గ కో-ఆర్డినేటర్స్ లిస్టులో పలు స్థానాలకు విద్యార్థి విభాగం నుండి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒకేసారి 5 గురు సంపత్ నాయక్ -వైరా, రవీందర్ రెడ్డి గోకుల -మునుగోడు, రామకృష్ణ మిరియాల – ఖమ్మం, నరేష్ బండి – సత్తుపల్లి, కత్తి సైదులు – కంటోన్మెంట్ కు అవకాశం కల్పించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభ్యర్థులకు ఓయూ నాయకులు జనసేన విద్యార్థి విభాగం నుండి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ సూర్తిని విద్యార్థుల రాజకీయ పాత్ర గురించి పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పిన విషయాలను గుర్తుచేశారు. ఓయూ నుండి 5 మందికి అవకాశం కల్పించడం పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ఉద్యమంపై ఉన్న గౌరవానికి నిదర్శనం అన్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి నాయకుల కు అవకాశం కల్పించారని ప్రజలు గుర్తించాలని జనసేన విద్యార్ధి విభాగం నాయకులు మహేష్ పెంటల ప్రశ్నించారు.