జనసేనాని “వారాహి యాత్ర”ను విజయవంతం చేయండి: పాలవలస యశస్వి

  • వారాహి యాత్ర పోస్టర్స్, స్టిక్కర్స్ ఆవిష్కరణ
  • ప్రచార రథంతో వారాహి యాత్ర వినూత్న ప్రచారం
  • వారాహి యాత్ర విజయవంతం కావాలని సర్వమత ప్రార్ధనలు
  • వారాహి యాత్రతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు కాయం
  • ఆంక్షలు ఎన్ని విధించిన వారాహి యాత్రను ఆపే ప్రసక్తే లేదు

విజయనగరం: స్థానిక పాల్ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి మాట్లాడుతూ జూన్ 14 నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే “వారాహి యాత్ర” జనసేన పార్టీ శ్రేణులు లక్షలాదిగా తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశం సమక్షంలో “వారాహి యాత్ర పోస్టర్లు, స్టిక్కర్స్” ఆవిష్కరణ యశస్వి ఆధ్వర్యంలో జనసేన నాయకులు సమక్షంలో జరిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు సనక సుబ్రహ్మణ్యం, మత్స్యకార విభాగ కమిటీ గనగల రాజు, జనసేన నాయకులు డాక్టర్ సారిక మురళీమోహన్ గారు, దాసరి యోగేష్ మోపాడ అనిల్ కిలారి ప్రసాద్, పతివాడ చిన్ని, కర్రోతు ఆనంద్, ఆబోతుల గోవింద్, కొర్నాన రామకృష్ణ, బూర్లి వాసు, బొబ్బాది చంద్రనాయుడు, కొవ్వాడ సతీష్, మీసాల శ్రీకాంత్, సారిక విశ్వ, దువ్వి రాము, శ్రీను, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.