“వారాహియాత్ర” విజయవంతం కావాలని పొన్నలూరు మండలంలో ప్రత్యేక పూజలు

  • 14-06-2023న బుధవారం ఉదయం 8 గంటలకి పొన్నలూరు సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజా కార్యక్రమం
  • మీడియా మిత్రులందరికీ ఆహ్వానం
  • జనసేన నాయకులు, వీరమహిళలు, అభిమానులు, కార్యకర్తలు, అందరూ పాల్గొనవలెను

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో “వారాహియాత్ర” విజయవంతం కావాలని పొన్నలూరు సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. జూన్ 14వ తేదీన బుధవారం రోజున అన్నవరం నుండి భీమవరం వరకు వారాహియాత్ర విజయవంతం కావాలని, ఆంధ్ర ప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ బుధవారం రోజు ఉదయం 8 గంటలకి ప్రత్యేక పూజ కార్యక్రమాలు పొన్నలూరు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నామని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.