నాగబాబు చిత్తూరు పర్యటనను విజయవంతం చేయండి

చిత్తూరు: జనసేన పార్టీ, అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసి, పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించడానికి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో పీఏసీ, జిల్లా కార్యాలయం నందు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి ఘనంగా స్వాగతం పలకాలి అని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి పీలేరు ఇంచార్జ్ బెజవాడ దినేష్, చంద్రగిరి నాయకులు బీగల అరుణ, రాయల్ వెంకట్, సంజీవి హరి, శ్రీకాళహస్తి ఇంచార్జి వినూత కోట, జిల్లా నాయకుడు కొట్టే సాయి, సత్యవేడు నుంచి లావణ్యకుమార్, నగిరి దేవ, స్వామినథన్, శివలింగం, గంగాధర్ నెల్లూరు ఇంచార్జి పొన్న యుగంధర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న రాష్ట్ర నాయకులు ఆకేపటి సుభాషిణి & జిల్లా నాయకులు ఆనంద్, హేమకుమార్, బాటసారి, మండల అధ్యక్షులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.