వారాహి యాత్రను విజయవంతం చేయండి

• కొల్లూరు మండల జనసేన శ్రేణులతో శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో చేపట్టనున్న వారాహి యాత్రను పార్టీ శ్రేణులంతా కలసి విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండల నాయకులతో కాసేపు ముచ్చటించారు. స్ధానిక సమస్యలపై చర్చించారు. మండల పరిధిలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రహదారుల దుస్థితి, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల లేమి, లబ్దిదారులు పడుతున్న ఇక్కట్లు, గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న అవస్థలను కొల్లూరు మండల జనసేన నాయకులు శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ కమిటీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కొల్లూరు మండల అధ్యక్షులు శ్రీ బొందలపాటి చలమయ్య, పార్టీ నాయకులు శ్రీ ఈమని మణికంఠ, శ్రీ పవన్ కుమార్, శ్రీ కోలా కుమార్ నాథ్, శ్రీ ఉప్పు శ్రీను, శ్రీ బావిరెడ్డి ప్రశాంత్, శ్రీ గుంటూరు వంశీ, జన సైనికులు పాల్గొన్నారు.