ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన మాకినీడి

పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా.. పిఠాపురం మండలం, జల్లూరు గ్రామానికి చెందిన ఒక రైతు ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న శేషుకుమారి శుక్రవారం బాధిత రైతు ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులను పరామర్శించి.. మనోధైర్యం చెప్పి.. జనసేన పార్టీ తరఫున భరోసా కల్పిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. గోపు సురేష్, పి.ఎస్.ఎన్. మూర్తి, జిల్లా కార్యదర్శులు మొగలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, మేళం బాబీ, నామ శ్రీకాంత్, యండ్రపు శ్రీనివాస్, దొడ్డి దుర్గాప్రసాద్, కంద సోమరాజు, జనసైనికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.