కొమరగిరి గ్రామంలో పర్యటించిన మాకినీడి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో తల్లిబోయిన అప్పయ్యమ్మ(81)
ఇటీవల మరణించడం జరిగింది. వారి నివాసానికి వెళ్ళి పరామర్శించి ఆమె చిత్రపటానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. తల్లిబోయిన వీర వెంకట సత్యనారాయణ, అడబాల సత్యనారాయణ, కట్టారి శ్రీను, నక్క శ్రీను, తల్లిబోయిన అప్పారావు, తల్లిబోయిన భద్రరావు, తల్లిబోయిన రాఘవ, తల్లిబోయిన మణికంఠ స్వామి, నక్క మాధవ, అనసూరి చిన్న,జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.