శ్రీ శ్రీ శ్రీ నేరేడ్లమ్మ ఆలయ నిర్మాణానికి విరాళం ప్రకటించిన మాకినీడి

పిఠాపురం నియోజకవర్గం, యు కొత్తపల్లి మండలం కొత్త పట్టణం గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషు కుమారి శ్రీ శ్రీ శ్రీ నేరేడ్లమ్మ తల్లి ఆలయం నూతన నిర్మాణం కొరకు 50 వేల రూపాయలు ప్రకటించి శనివారం ఆలయం కమిటీ పెద్దలకు 20వేల రూపాయలు అందజేశారు. ఈ నెల 17,18,19, జాతర మహోత్సవం సమయంలో 30 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, పంతాడ దుర్గాప్రసాద్, సూరడా శ్రీను, పంతాడ అప్పలరాజు, పట్టా అప్పన్న, వనమాడి ఎల్లారావు, సూరి మల్ల ప్రసాద్, పాత్రి గంగాధర్, పంతాడి ముళ్ళస్వామి, ఆలయ కమిటీ సభ్యులు జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.