జర్నలిస్టు శ్యాంప్రసాద్ ను పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

• పిఠాపురం జర్నలిస్టులకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మాకినీడి శేషు కుమారి
• జర్నలిస్టులు వృత్తితో పాటుగా ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలని విన్నవించిన మాకినీడి
• నిరంతరం ప్రజా సమస్యలను వార్త రూపంలో వెలికి తీసే జర్నలిస్ట్ నేటి తరానికి ఎంతో అవసరం

పిఠాపురం, శనివారం ఉదయం యధావిధిగా విధినిర్వహణలో ప్రయాణమై బయటకు వెళ్తున్న వేగ న్యూస్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ కు ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెల్లో నొప్పి రావడంతో చాలా అస్వస్థతకు గురయ్యారు. తోటి జర్నలిస్టుల సహాయంతో పిఠాపురం ఎంఎస్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. శ్యాంప్రసాద్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి శ్యాంప్రసాద్ ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్స్ ను అడిగి తెలుసుకొన్నారు. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందివ్వాలని వైద్యులను కోరారు. అనంతరం ఆమె శ్యాంప్రసాద్ తో మాట్లాడుతూ ఎటువంటి భయాందోళనలు చెందవద్దని నా హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ వైద్యం పరంగా జనసేన పార్టీ తరఫునుండి మేమంతా ఎప్పుడు తోడుగా ఉన్నామంటూ శ్యాంప్రసాద్ కు మనో ధైర్యాన్ని కల్పించారు.