37వ రోజు “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం”

సర్వేపల్లి, ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి బిట్-1 గ్రామంలో జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలోని, సర్వేపల్లి గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలో సంపాదించిన తన కష్టార్జితాన్ని 3000 మంది చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి ఆదుకున్నాడు. మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గత టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీ నుంచి వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉంది కూడా రైతులకు న్యాయం చేయలేకపోయారు. రైతులకు తన సొంత కష్టార్జితంతోనే అంత న్యాయం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇస్తే జనసేన ప్రభుత్వంలో రైతులకు కష్టం రాకుండా అండగా నిలబడతాడు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాస్ కి ఓటు వేసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. తాండ్ర శ్రీను, సతీష్ గౌడ్ పాల్గొన్నాడు.