సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ: బత్తుల
- సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలు… ముగ్గుల పోటీలు
సీతానగరం మండలం, సంక్రాంతి సందర్భంగా సింగవరం కాలనీలో జరిగిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి ముగ్గురు విజేతలకు జనసేన పార్టీ తరపున బహుమతులు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అందజేసారు.. పోటీలలో ముగ్గులతో వేసిన జనసేన లోగో, జనసేన గాజుగ్లాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమంలో జనసేన పార్టీ పేరుమీద పలు నినాదాలు చేసాయి ఈ సందర్భంగా మీడియాతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ప్రతీకలు.. మహిళల అభ్యున్నతికి, సంక్షేమానికి, స్వయం సమృద్ధికి జనసేన పార్టీ కృషి చేస్తుందని… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళలంటే విపరీతమైన గౌరవమని, అందుకే వారికి పార్టీలో వీర మహిళలు అనే నామకరణం తో ప్రత్యేక గౌరవించడం అందరికీ తెలిసిందే అని .. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, అందరికి భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, సీనియర్ నేతలు, జనసైనికులు పాల్గొన్నారు.