బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచిన మాకినీడి శేషుకుమారి

  • బాధిత కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలి
  • ప్రకటించిన ఎక్స్ గ్రేషియా అందజేయాలి

కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన బొంతు రమణ అనే గీత కార్మికుడుని పీడీ చట్టం క్రింద అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ అస్వస్థతకు గురైన రమణ కాకినాడ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. మృతుని కుటుంబాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి పరామర్శించి, జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం జరిగింది. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున ప్రకటించిన ఎక్స్ గ్రేషియా, మాటమీద నిలబడి సకాలంలో అందించాలని కోరారు. సకాలం లో మృతుని కుటంబానికి న్యాయం జరగక పోతే జనసేన పార్టీ రమణ కుటుంబానికి అండగా నిలిచి పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.