జనసైనికుడు స్వామి కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి

పిఠాపురం నియోజకవర్గం, విరవాడ గ్రామంలో కొద్దిరోజుల క్రితం బెరవాడ గోపాల స్వామి గుడిలో దీపం చీరకి అంటుకుని ఒంటికి గాయాల పాలై, హాస్పటల్లో చికిత్స అనంతరం ఇంటి దగ్గర బెడ్ రెస్టు తీసుకుంటూ మరణించిన జనసైనికుడు మైనం స్వామి తల్లి అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజవర్గ జనసేన ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషు కుమారి పరామర్శించి మనోధైర్యాన్ని చెప్పి వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని ప్రార్థించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యాకర్ రావు, కాళ్ల రాజు, కంద సోమరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.