జనసేన పార్టీ కరపత్రాల పంపిణీ చేసిన మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజవర్గం సుండుపల్లి మండలంలో పలు గ్రామాలలో రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఇంటింటికి తిరిగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా జనసేన పార్టీ కరపత్రాలను అందజేయడం జరిగింది. అక్కడ ఉండే గ్రామ ప్రజలు వైసిపి పరిపాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండలం అధ్యక్షులు ఓబులేసు, జనసేన పార్టీ చేనేత వికాసరాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర పంతులు, వీరయ్య ఆచారి, మల్లెం నరసింహులు, తాళ్లపాకశంకరయ్య, హేమంత్, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగినది.