జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తుని నియోజకవర్గం: జనసేన పార్టీ 3వ విడత క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం అద్దేపల్లి బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం తుని టౌన్ 8వ వార్డులో అట్టహాసంగా ప్రారంబించి, మొదటి కిట్టును పసుపులేటి శివ శంకర్ కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు వంగలపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు, మరియు తుని టౌన్ జనసేన నాయకులు ఉప్పలపాటి సీతారామరాజు, వేగిశెట్టి రమణ, ఉదయ, భాస్కర్ చందు, సాయి, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, రాజశేషు, నాగేశ్వరరావు, రాంబాబు, రాము, నానాజీ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా తుని టౌన్ లోని ప్రతి శుక్రవారం జనంలోకి జనసేన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తుని టౌన్ నాయకులు తెలపడం జరిగింది.