పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ రాజంపేటకు వచ్చినటువంటి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గనికి, రాజంపేట పార్లమెంటుకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది. రాజంపేటలో సరైన డయాలసిస్ సెంటర్ లేక నెలకు 30 మంది చనిపోతున్నారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య డ్యాం తెగిపోయి ఎంతోమంది పేదవారు ఈరోజుకి కూడా తాత్కాలిక షెడ్లలో ఉంటూ దుర్భర జీవితం గడుపుతున్నారని తెలియజేశారు. పురందేశ్వరి రాజంపేట సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్నమయ్య డ్యాం వరద బాధితులకు న్యాయం చేయాలని మలిశెట్టి వెంకటరమణ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, ఆచారి, కిషోర్, చౌడయ్య, జనసేన వీర మహిళ జడ్డ శిరీష తదితరులు పాల్గొన్నారు.