మల్లాడి కృష్ణారావుని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి యానాం క్షేమంగా చేరుకున్న టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లాడి కృష్ణారావుని పరామర్శించడం జరిగింది. వీరితో సానబోయిన మల్లికార్జునరావు, ముత్యాల జయలక్ష్మి, అత్తిలి బాబురావు, విత్తనాల అర్జున్, పితాని రాజు, చిట్టూరి దొరబాబు, పోతబత్తుల రాంబాబు, వైదాడి దశరధ్ తదితరులు పాల్గొన్నారు.