వంతెన పునరుద్ధరించాలని మామిడికుదురు జనసేన నిరసన

పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం వాడ్రేవుపల్లి నుండి వెళ్లే ప్రధాన డ్రైనేజీపై పాశర్లపూడిలంక నుండి లూటుకుర్రు వెళ్లే మార్గమధ్యలో వంతెన పూర్తిగా ధ్వంసమైనది దీనిపై అనేకసార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసం అయి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దీనితో మామిడికుదురు మండలం జనసేన పార్టీ తరపున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్లు సమైక్య అధ్యక్షులు అడబాల తాతకాపు, స్థానిక ఎంపీటీసీ చెరుకూరి సత్తిబాబు, కొమ్ముల జంగమయ్య, గ్రామశాఖ అద్యక్షుడు తెలగరెడ్డి బుల్లి నాగేశ్వరరావు, మట్టా సత్తిబాబు, తు౦డూరి బుజ్జి, మండల కార్యదర్శి కాట్రేనిపాడు నాగేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల శేఖర్, ఇంజే రవి, మేడిద బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరాటంలో పాల్గొన్న వారందరికీ మామిడికుదురు జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాలె౦ శ్రీనివాసరాజా(జె.ఎస్.ఆర్) ధన్యవాదాలు తెలిపారు.