జనసేన, టిడిపి పార్టీల ఉమ్మడి కార్యాచరణ సమావేశం

రంపచోడవరం నియోజవర్గం: తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అడ్డతీగలలో ప్రతి నెల జరగబోయే జనసేన మండల సమావేశం శనివారం యధావిధిగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అడ్డతీగల మండలం నాయకులు కార్యకర్తలని ఆహ్వానించడం జరిగింది. జనసేన టిడిపి పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ఎలా ముందుకు వెళ్లాలి, కలిసికట్టుగా మరెన్నో కార్యక్రమాలు చేయాలని అనే అంశాలు పైన చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జర్త వెంకటరమణారెడ్డి, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు పొడుగు సాయి, సింగిరెడ్డి వెంకన్న, పల్లాల రవి రాజశేఖర్ రెడ్డి, ముత్యాల చిన్నరెడ్డి తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీలు సీనియర్ నాయకులు యూనిట్ ఇన్చార్జిలు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *