ఘనంగా మారిసెట్టి నరసింహ మూర్తి జన్మదిన వేడుకలు

తాడేపల్లిగూడెం: బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మారిసెట్టి నరసింహ మూర్తి జన్మదినం సందర్భంగా స్థానిక బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ అనంతరం నియోజక వర్గ అధ్యక్షులు కేశవబట్ల విజయ్ ఆధ్వర్యంలో యాగర్లపల్లి ప్రేమాలయం వద్ద యాచకులకి భోజనం వితరణ జరిగింది. ఈ సేవాకార్యక్రమానికి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు కాశీ మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ సంఘం బలోపేతానికి నరసింహమూర్తి గారి కృషి ఎనలేనిది అని జిల్లాలో జరిగే ప్రతి బీసీ ఉద్యమానికి బీసీల హక్కుల కోసం జరిగే ప్రతి సమావేశానికి అతని సహకారం మాటల్లో చెప్పలేనిది అని అన్నారు. కేశావబట్ల విజయ్ మాట్లాడుతూ సిద్దాంతాలు క్రమశిక్షణ కలిగిన మంచి కార్యకర్త నరసింహ మూర్తి గారు అని ప్రతి సమావేశానికి తప్పక హాజరవుతూ పులే భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎనలేనిది అని, యువతరంతో పోటీ పడుతూ యువతలో బీసీ రాజ్యాధికారం కోసం పోరాడే స్ఫూర్తి కలిగిస్తూ ప్రతి సమావేశానికి అందరూ హాజరు అయ్యేలా చూడటంలో అతని సేవలు మరవం అని అన్నారుఇలాంటి జన్మదినలు మరెన్నో చేసుకుంటూ పులే కలలు కన్న రాజ్యాధికారం సాకారం అయ్యేలా ఆయన కృహి చేస్తారు అని ఆశిస్తున్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గం యువజన అద్యక్షులు అత్తిలి బాబి, నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్న, బీసీ నాయకులు ఇమ్మంది బెనర్జీ, పిన్నేటి రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.