అమరావతి రైతుల మహా పాదయాత్రకి సంఘీభావంగా – విక్కిరాలపేట గ్రామం

న్యాయస్థానం నుండి దేవస్థానం… అమరావతి రైతుల పాదయాత్ర… ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో ముగించుకొని కందుకూరు నియోజకవర్గం లోకి 15వ తేదీ సోమవారం కందుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ పులి మల్లికార్జున ఆదేశాల మేరకు విక్కిరాలపేట జనసేన నాయకులు మనోజ్ యం(ంంఖ్) మరియు జై భీమ్ యూత్ వారి అహ్వానమేరకు గ్రామంలోకి ఘనస్వాగతం పలకడం జరిగింది. మంగళవారానికి అమరావతి రైతులు దీక్షలు చేపట్టి 700వ రోజు సందర్భంగా విక్కిరాలపేట గ్రామం నుండి అమరావతి రైతుల మహా పాదయాత్రకి సంఘీభావంగా విక్కిరాలపేట జనసేన నాయకులు మెడబలిమి మనోజ్(ంంఖ్) మరియు విక్కిరాలపేట అంబెడ్కర్ యూత్ ఈసా మనికుమార్, యరమాల దత్తు,పల్నాటి బ్రహ్మనాయుడు.యరమాల మజ్ను, దానం అజయ్, జి లవ్ కుమార్, వై సాయి మరియు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగింది.