అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మార్కాపురం జనసేన

మార్కాపురం నియోజకవర్గం, ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాధ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి పోయిందని, ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యిద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జనసేన పార్టీ నాయకులు మార్కెట్ శ్రీను, వెంకట్రావు, చేతుల శ్రీనివాసరావు, పెరూరి రమేష్, సాయి నాయుడు, దుమ్మని చందు, పోశంశెట్టి వెంకట్రావు, పిచ్చయ్య, చంద్రశేఖర్, జానకిరామ్ సింగ్, కళ్యాణ్, వీరిశెట్టి శ్రీనివాసులు మరియు జనసైనికులు.