యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో భారీగా చేరికలు

రాజంపేట: జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. యస్ ఉప్పరపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల నుంచి పెద్దలు, యువకులు, మహిళలు సుమారు 150 మంది చేరినట్లు ఆపార్టీ రాజంపేట నేత యల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి యువకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ దుందుభి మోగించనున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కట్టా మల్లికార్జున, వంశీ, రవి, కదిరి ప్రతాప్, కొత్తపల్లి ఖాదర్ వల్లి, బంద్ గారి బాద్షా, గంప రమణ, పోతిరెడ్డి రుద్ర ప్రతాప్, మల్లికార్జున, బంగారు పల్లె సుబ్రహ్మణ్యం, హరి, బచ్చల నాగేంద్ర, కదిరి గోపయ్య, హరి రెడ్డి, రేవూరి మూర్తి, ఏరి పెద్ద సుబ్బయ్య, బొమ్మ తట్టి హరి, మల్లి, రుద్ర, నంద్యాల ప్రతాప్, నంద్యాల అజయ్, నరసింహ, ఆకాష్, తిరు వెంకటేష్, నంద్యాల సుబ్బయ్య, తమ్మిశెట్టి రెడ్డయ్య, వల్లపు వెంకటేష్, వల్లెపు సురేష్, గజ్జల హరినాద్ రెడ్డి, వల్లప్ప నగేష్, శివయ్య, తప్పిట మహేష్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, గజ్జల నరసింహారెడ్డి, తప్పేట నాగ సుబ్బారెడ్డి, గంగాధర్ రెడ్డి, రమణారెడ్డి, సూర్య ప్రతాప్, పుత్తా ఎల్లయ్య, పుత్తా రాజు రాజంపేట జనసేన నాయకులు మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, ఆకుల చలపతి, పివిఆర్ కుమార్, పత్తి నారాయణ, రామకృష్ణ రాజు, రాజా ఆచారి, చిట్టే భాస్కర్, మౌల, సుండుపల్లి నాయకులు చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.