సాలూరు జనసేనలో భారీ చేరికలు

విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం, మెంటాడ మండలంలో బుధవారం సుమారు 300 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే అందరికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి పడాల అరుణ గజపతినగరం నియోజకవర్గం జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.