జనసేన పార్టీలో భారీ చేరికలు

నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీ 54 వ డివిజన్ నుంచి వందలాది మంది మహిళలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, నెల్లూరు నగర నియోజకవర్గం ఇంచార్జి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి అధ్యక్షతన షేష్ హసీన ఆద్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. చేరిన వారిలో ఎక్కువగా ముస్లిం మైనారిటీ మహిళలు ఉన్నారు. మహిళలు పెద్దఎత్తున జిల్లా కార్యాలయానికి రావడంతో కిక్కిరిసి పోయింది. నెల్లూరు నగరంలో చెన్నారెడ్డి మనుక్రాంత్ చేపట్టుతున్న గడపగడపకు జనం కోసం జనసేన కార్యక్రమం ఆదరణ చూసి భారీ సంఖ్యలో మహిళలు జనసేనలో చేరేందుకు ముందుకు వచ్చి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ నుంచి భారీఎత్తున మహిళలు జనసేన పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులకు జగన్ అన్యాయం చేశారన్నారు. షాదీ ముబారక్, అందించలేక పోయారని మండిపడ్డారు. మైనారీటీలకు విదేశీ విద్యను దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీతోనే మైనారిటీలకు న్యాయం జరుగుతుందని నమ్మి పార్టీలో చేరుతున్నారని చెన్నారెడ్డి మనుక్రాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజయ్ బాబు. అధికార ప్రతినిధులు, కారంపూటి కృష్ణారెడ్డి, నయీమ్, కలువాయి సుధీర్, మహిళా నాయకురాలు షేక్ ఆలియా తదితరులు పాల్గొన్నారు.