జనసేన పార్టీలో భారీ చేరికలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై దాదాపు 100 మంది యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. స్థానిక ఎస్. ఆర్ ఫంక్షన్ హాల్ నందు సమావేశం ఏర్పాటు చేసి బాలాజీ, శంకర్, సాయి చందు అధ్వర్యంలో యువత జనసేన పార్టీలో చేరారు. అందరికీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా, జిల్లా అధ్యక్షులు శ్రీ డా. పసుపులేటి హరి ప్రసాద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు పార్థసారధి, ఆనంద్, త్యాగరాజులు, ఉమా మహేశ్వరి, భాగ్య లక్ష్మి, జ్యోతి, చందు చౌదరి, గిరీష్, తదితరులు పాల్గొన్నారు.