కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం, తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు శనివారం నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బాగంగా జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు బైరపోగు సాంబశివుడు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బైరపోగు సాంబశివుడు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్క సభ్యునికి, సభ్యత్వాలు నమోదు చేయించిన కో-ఆర్డినేటర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అదే విధంగా
కొల్లాపూర్లో యువతను కేవలం రాజకీయ నాయకుల లబ్ది కోసం మాత్రమే వాడుకుంటున్నారు. యువతకు వారి వారి ఆశయం, లక్ష్యాలను నెరవేర్చే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యువతకు పెద్ద పీట వేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక్క జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు.

యువత ఇకనైనా మేలుకొని, స్వార్థ రాజకీయాలను ఎండగట్టాలి.
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను, యువత పట్ల జనసేన బలంగా నిలబడుతుంది. అన్న పట్ల పవన్ కళ్యాణ్ గారి ఆశయసిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో బలంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అని దిశనిర్ధేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సూర్య, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తల్లారి సాంబశివుడు, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యులు తల్లారి మల్లేష్, కోడెర్ మండల నాయకులు పోలోజు రఘు, ఫారూఖ్, సుల్తాన్, రవితేజ, నాగరాజు, అంజి, శేఖర్, మాసుం, వడ్డేమాన్ లక్ష్మణ్, బాలాజీ, అంజి, సైదులు, అరవింద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.