జాలంపల్లి పంచాయతీలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు

  • పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాయిపురెడ్డి కృష్ణ

మాడుగుల నియోజకవర్గం: జాలంపల్లి పంచాయతీ, రావుపాలెం గ్రామంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ చేతుల మీదుగా మరియు హరే రామ్ వెంకటేష్ వర్మ ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారినీ పార్టీలోకి కండువా కప్పి రాయిపురెడ్డి కృష్ణ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రావుపాలెం గ్రామ పెద్ద చెప్పాడు మారయ్య మాట్లాడుతూ.. గ్రామంలో పలు సమస్యలను జనసేన పార్టీ నాయకులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయపరెడ్డి కృష్ణ మాట్లాడుతూ.. మాడుగుల నియోజకవర్గంలో పదవి రాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రానుని ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని గ్రామ ప్రజలకు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరేరామ్, గుమ్మడి అప్పారావు. బొడి శ్రీనివాస్, రామి శ్రీనివాస్, బచ్చల వెంకీ, బచ్చల రాము, బచ్చల రవి. కవ్వల రాజు, నల్లి పవన్ మరియు మాడుగుల మండల జనసేన నాయకులు ఘట్టా రామారావు, కోన శ్రీను, గుమ్మాల నానాజీ, రామ కృష్ణ, కాలింగి మూర్తి తదితరులు పాల్గొన్నారు.