చింతపల్లిలో పార్టీ పటిష్ట నిర్మాణం కొరకు జనసేన సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలంలో సమావేశమైన జనసేన పార్టీ నాయకులు. ముఖ్య అతిధిగా హాజరైన జనసేన పార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య ఈ సమావేశంలో ముఖ్యంగా మండలంలో గల ప్రతి గ్రామము నుంచి క్షేత్ర స్థాయి పార్టీ యొక్క పటిష్టనిర్మాణం కొరకు గ్రామ కమిటీ, పంచాయితి కమిటి, మండల కమిటీ వరకు త్వరలోనే నియామకాలు శరవేగంగా జరగాల్సి ఉందని, ఇన్చార్జ్ తో మండల నాయకులందరూ ఉమ్మడిగా నిర్ణయించుకున్నారు. అలాగే మండలంలో ఉన్న ప్రతి జనసైనికుడిని, అభిమానిని గుర్తించి పార్టీకి చేరువయ్యేలా కృషి చెయ్యాలని, గ్రామ, పంచాయితీ మరియు మండల కమిటీ నియామకానికి ముందు చింతపల్లి మండలంలో గల 17 పంచాయితిలలో ప్రతి పంచాయితీని సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితులు జనసైనికుల సమాచారం తెలుసుకుని వారినందరిని ఐక్యంచేసుకుంటు అత్యంత వేగంగా తగు నిర్ణయాలు తీసుకుని త్వరలోనే అందరి ఆమోదంతో నిర్ణయించిన గ్రామ, పంచాయితీ, మండల కమిటీ నియామకాలు చేపడతామని డా.గంగులయ్య అలాగే చింతపల్లి మండల నాయకులు, వాడకని నాని, వంతల బుజ్జి బాబు నాగు, రవితేజ, పండు, బద్రీనాద్, గాజుల శ్రీను, రామకృష్ణ తెలిపారు. అలాగే ప్రతి గ్రామ పంచాయితీ పర్యటించడానికి ఒక కమిటీ నియమించి వారి ద్వారా… పై విషయాలపై స్పష్టత వచ్చేలాగా తీర్మానించడమైనది. ఈ సమావేశంలో చింతపల్లి మండల నాయకులు వాడకని నాని, వంతల బుజ్జిబాబు, పండు, బద్రీనాద్, నాగు, గాజుల శ్రీను, గొందిపాకలు సాయి, స్వామి, రవితేజ, రామకృష్ణ, జి మాడుగుల మండల అధ్యక్షులు భీమన్న మసాడి, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు పాంగి, పాడేరు జనసేన ఐ.టి విభాగ అధ్యక్షులు అశోక్ సాలేబు తదితరులు పాల్గొన్నారు.