మస్తాన్ రాయల్ ను సత్కరించిన డా. పసుపులేటి

రాజంపేట: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు నుంచి కాలి నడకన తిరుమలకు వెళ్తున్న జనసైనికుడు మస్తాన్ రాయల్ ను తిరుపతి పీఏసీ ఆఫీసు నందు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ శాలువాతో సత్కరించి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని, ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.