వైసీపీ ప్రభుత్వంలో దగాపడ్డ, మోసపోయిన ఎస్సీ,ఎస్టీ లకు అండగా జనసేన పోరాటం

ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో అగ్రహారం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద 4-02-2023 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ఎస్సీ,ఎస్టీలకు చట్ట ప్రకారం రావలసిన నిధులు మరియు సంక్షేమ పథకాల కోసం జనసేన పార్టీ నుండి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పొన్నలూరు మండలంలో జాతీయదళిత నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత మరియు ప్రజా సంఘాల నాయకులు హాజరవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు.