జనసేనానిపై మస్తాన్ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి

  • సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి: వెంకటాచలం మండలంలో వున్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ స్వామి దర్గాను బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు దర్శించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ నాలుగో విడత వారాహి విజయ యాత్ర బుధవారం పెడన నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభలో కొన్ని అవాంఛ నీయ సంఘటనలు జరిపి, సభా ప్రాంగణంలో గందరగోళాలు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళవారం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు అందరికీ కూడా తెలియజేశారు. అటువంటి సంఘటనలు జరగనివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం కూడా జరిగింది. కొంతమంది రాళ్ల దాడి చేసేదాన్ని కూడా అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ముందుగానే మేము తెలియజేస్తున్నామని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు తలపెట్టాలనే వారిని కఠినంగా శిక్షించాలని ఆ కసుమూరు మస్తాన్ స్వామి ఆశీస్సులతో పెడనలో జరిగే భారీ బహిరంగ సభలో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా కాపాడాలని, దోషులను ఆ మస్తాన్ స్వామి వారే శిక్షించాలని స్వామి సన్నిధిలో కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు ఖాజా, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, సాయి, మల్లి తదితరులు పాల్గొన్నారు.