112వ రోజు దిగ్విజయంగా పవన్ అన్న ప్రజా బాట

  • వచ్చే ఎన్నికలలో జనసేనను ఆదరించండి
  • రాజంపేట జనసేన నాయకులు

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు నందలూరు మండలంలోని పలు గ్రామాలలో ఎర్ర చెరువు పల్లె, చింతలకుంట, చెన్నైగారిపల్లి, ఈదరపల్లి, దుర్గాపురంలలో పవన్ అన్న ప్రజా బాట 112వ రోజు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి జనసేన రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రానున్న ఎన్నికలలో జనసేనను ఆదరించాలని ఆ గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, ఆచార్య, కిషోర్, చౌడయ్య, శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు జడ్డ శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.