తెలంగాణ జర్నలిస్టులకు ఎండి సజ్జనార్ గుడ్ న్యూస్

తెలంగాణ జర్నలిస్టులకు ఎండి సజ్జనార్ గుడ్ న్యూస్ తెలిపారు.  తెలంగాణ‌లో జ‌ర్నలిస్టులు ఎక్క‌డికి వెళ్లాల‌న్న వారు ప‌ని చేసే జిల్లాలో ఉచితంగా ఆర్టీసీలో ప్ర‌యాణించే సౌక‌ర్యం ఎప్ప‌టి నుంచో ఉన్న‌ది. ఇది వ‌ర‌కు అక్రిడేష‌న్ ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు బ‌స్సు ప్ర‌యాణంలో టికెట్ తీసుకునేందుకు ప్ర‌త్యేక బ‌స్‌పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్ సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం కల్పించారు ఎండి సజ్జనార్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పలువురు జర్నలిస్టుల సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్ల‌డించారు. అదేవిధంగా జ‌ర్న‌లిస్టుల‌కు ప‌లు  సూచ‌న‌లు తెలిపిన అనంత‌రం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు స‌జ్జ‌నార్‌.