హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామ హైందవ సైన్యం మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కమిటీ వారి ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కాపవరం జనసేన పార్టీ యువనాయకులు శివాజీ, కోరుకొండ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముని ప్రసాద్, బొజ్జపు సత్యనారాయణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.