మే 26 నుండి శ్రీ నాగబాబు దుబాయ్ పర్యటన

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మే 26 నుండి మూడు రోజుల పాటు దుబాయ్ లో పర్యటించనున్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాలలో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణుల కోసం దుబాయ్ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో శ్రీ నాగబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జనసేన పార్టీ కార్యక్రమాలు, ఇతర ఎన్నో సామాజిక సేవలలో బాధ్యతాయుతంగా పాల్గొంటున్న గల్ఫ్ దేశాల ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీరమహిళలతో నాగబాబు ముఖాముఖి చర్చించనున్నారు. నాగబాబు గారితో పాటుగా పార్టీ నాయకులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఈ పర్యటనలో పాల్గొంటారు. కేసరి త్రిమూర్తులు, చందక రామదాసు, కంచన శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగనున్నాయి.