అడబాల సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ వాస్తవ్యులు అడబాల సూరిబాబు మరణవార్త సీతానగరం మండల జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న సీతానగరం గ్రామానికి వెళ్ళి సూరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కతా సత్యనారాయణ, సీతానగరం మండల జనసేన పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి చిడిపి నాగేష్, సీతానగరం మండల నాయకులు అప్పయ్యమ్మా (ప్రసాద్) సీతానగరం మండల కమిటీ సభ్యులు దుబాయ్ శ్రీను, సీతానగరం మండల వీరామహిళ కందికట్ల అరుణకుమారి, సీతానగరం మండల జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.